రైతుల చావులు దొర కళ్లకు కనపడవు: షర్మిల
ABN , First Publish Date - 2022-01-11T18:21:30+05:30 IST
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సాఆర్టీపీ అధినేత్రి ట్విటర్ వేదికగా స్పందించారు. రైతులు ఆత్మహత్యలు కనపడవు కానీ..
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై వైఎస్సాఆర్టీపీ అధినేత్రి ట్విటర్ వేదికగా స్పందించారు. రైతులు ఆత్మహత్యలు కనపడవు కానీ.. రైతు బంధు కోసం వారోత్సవాలా? అని ప్రశ్నించారు. ‘‘ఈరోజు పోడెం కృష్ణ కడుపులో పురుగుల మందు చేరింది. గన్యానాయక్ మెడకు ఉరితాడు పడ్డది. రోజుకు ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు.. రైతుల చావులు కండ్లకు కనపడవు దొరకి. దొరగారి మెప్పుకోసం రైతు బంధు వారోత్సవాలా? మీరు జరుపుకొనేది రైతు బంధు వారోత్సవాలు కాదు, రైతు చావుల వారోత్సవాలు’’ అని షర్మిల ట్వీట్లో విమర్శించారు.