ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తా: YS Sharmila

ABN , First Publish Date - 2022-06-12T18:45:59+05:30 IST

Khammam: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూనే.. అధికారంలోకి వస్తే తానేం చేస్తానో చెప్పారు. ఖమ్మం

ఆశీర్వదించండి..అభివృద్ధి చేసి చూపిస్తా: YS Sharmila

Khammam: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పిస్తూనే.. అధికారంలోకి వస్తే తానేం చేస్తానో చెప్పారు. ఖమ్మం జిల్లా మధిర నియోజక వర్గం మడుపల్లి గ్రామస్థులతో ఆమె మాట్లాడారు. 


   ‘‘ఉద్యమ కారుడు కదా అని కేసీఆర్‌కు ముఖ్యమత్రి పీఠం అప్పజెపితే 8 ఏళ్లు ఆడింది ఆట .. పాడింది పాటగా పాలన సాగుతోంది. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతోంది. ప్రజల పక్షాన నిలబడేందుకు పార్టీ పెట్టాం. ఆశీర్వదించి గెలిపించండి.. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తా. ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా అమలు చేస్తా. పోడు భూములకు పట్టాలు ఇస్తా. తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం నిలబడతా. కేసీఆర్ చేతిలో ఈ సారి మళ్ళీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేస్తారు’’ అని షర్మిల పేర్కొన్నారు.  

Updated Date - 2022-06-12T18:45:59+05:30 IST