షుగర్ ఫ్యాక్టరీ కారణంగానే శారద నది కాలుష్యం: రాజేంద్ర సింగ్

ABN , First Publish Date - 2022-03-12T01:07:24+05:30 IST

నదులు కాలుష్యం బారిన పడడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వాటర్ మాన్ ఆఫ్

షుగర్ ఫ్యాక్టరీ కారణంగానే శారద నది కాలుష్యం: రాజేంద్ర సింగ్

విశాఖ: నదులు కాలుష్యం బారిన పడడం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్  అన్నారు. నగరంలో ఆయన మాట్లాడుతూ తల్లిలాంటి శారదా నది మానవ తప్పిదంతోనే కాలుష్యమవుతోందన్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కారణంగానే శారద నది కాలుష్యమవుతోందని ఆయన పేర్కొన్నారు. గోవాడ చక్కెర నుంచి శారద నదిని కాపాడుకోకపోతే భవిష్యత్ అంధకారం అవుతుందని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2022-03-12T01:07:24+05:30 IST