Vemulawada Rajanna ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి మహోత్సవాలు
ABN , First Publish Date - 2022-09-26T13:59:13+05:30 IST
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
రాజన్నసిరిసిల్ల: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి(Vemulawada Sri Rajarajeswara Swamy Temple) వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు (Sridevi Sharannavaratri Mahotsavam) వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి వచ్చేనెల 5 వరకు ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగనున్నాయి. పది రోజుల పాటు రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటిరోజు శైలపుత్రి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.