అమ్మా.. దుర్గమ్మ..

ABN , First Publish Date - 2020-10-17T11:27:16+05:30 IST

జిల్లాలోని దుర్గమ్మ ఆలయాల్లో శనివారం నుంచి ఈనెల 25 వరకు శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నా యి.

అమ్మా.. దుర్గమ్మ..

నేటి నుంచి శరన్నవ రాత్రులు ప్రారంభం 

ఆలయాలు ముస్తాబు 


ద్వారకాతిరుమల, అక్టోబరు 16 : జిల్లాలోని దుర్గమ్మ ఆలయాల్లో శనివారం నుంచి ఈనెల 25 వరకు శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నా యి. దీంతో ఆలయాలు ముస్తాబయ్యాయి. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణం గా భక్తులకు దర్శనమిచ్చేందుకు మార్కింగ్‌ల ఏర్పాట్లు ఆలయ నిర్వా హకులు పూర్తి చేశారు. ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామి ఉపాలయమైన కుంకుళ్లమ్మ దేవాలయంలో శనివారం ఉదయం అమ్మవారిని మహారేణుకా దేవీ అలంకరణలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. దేవాలయంలో ప్రత్యేక కుంకు మ పూజలు నిర్వహిస్తామని మహిళలు పాల్గొనాలని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-10-17T11:27:16+05:30 IST