ఎన్సీపీ అధినేత పవార్‌కు అస్వస్థత

ABN , First Publish Date - 2021-03-29T22:42:06+05:30 IST

ఈ విషయమై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తన సోషల్ మీడియా ద్వారా సోమవారం స్పందించారు. ‘‘మా పార్టీ అధినేత శరాద్ పవార్, నిన్న సాయంత్రం కడుపునొప్పి కారణంగా అసౌకర్యంగా కనిపించారు

ఎన్సీపీ అధినేత పవార్‌కు అస్వస్థత

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరాద్ పవార్‌ అనారోగ్యంగా ఉన్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. అంతే కాకుండా సర్జరీ నిమిత్తం ఆయన బుధవారం (మార్చి 31) ఆసుపత్రిలో చేరనున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్‌ తీవ్రంగా పెరగడంతో 2004లో ఆయనకు సర్జరీ జరిగింది. అనంతరం ఆయన క్యాన్సర్‌ను జయించారు.  80 పవార్, ప్రస్తుతం గాల్ బ్రాడర్ జబ్బుతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.


ఈ విషయమై ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ తన సోషల్ మీడియా ద్వారా సోమవారం స్పందించారు. ‘‘మా పార్టీ అధినేత శరాద్ పవార్, నిన్న సాయంత్రం కడుపునొప్పి కారణంగా అసౌకర్యంగా కనిపించారు. చెకప్ కోసం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిని సంప్రదించి టెస్ట్‌లు చేయగా గాల్ బ్లాడర్ సమస్య ఉందని వైద్యులు తెలిపారు. బుధవారం ఆయనను ఆసుపత్రిలో చేరి సర్జరీ చేసుకోనున్నారు’’ అని నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు.

Updated Date - 2021-03-29T22:42:06+05:30 IST