Shapoorji Pallonji గ్రూప్ ఛైర్మన్ పల్లోంజి మిస్త్రీ కన్నుమూత

ABN , First Publish Date - 2022-06-28T15:17:08+05:30 IST

షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ సోమవారం రాత్రి కన్నుమూశారు....

Shapoorji Pallonji గ్రూప్ ఛైర్మన్ పల్లోంజి మిస్త్రీ కన్నుమూత

ముంబయి (మహారాష్ట్ర): షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చైర్మన్ పల్లోంజీ మిస్త్రీ సోమవారం రాత్రి కన్నుమూశారు. 93 ఏళ్ల ప్రముఖ పారిశ్రామికవేత్త ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ దేశంలోని అతిపెద్ద వ్యాపార సమూహాలలో ఒకటిగా ఎదిగింది.2022 జూన్ 28వతేదీ నాటికి బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం పల్లోంజీ దేశంలో అత్యంత ధనవంతుడు. పల్లోంజీ మిస్త్రీ నికర ఆస్తుల విలువ 28.90 బిలియన్ డాలర్లు.షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్18 ప్రధాన కంపెనీలతో కూడిన ప్రపంచవ్యాప్త సంస్థ. 1865లో స్థాపించిన ఈ పల్లోంజీ కంపెనీ ఇంజనీరింగ్ నిర్మాణం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, వాటర్, ఎనర్జీ, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో వ్యాపారం సాగిస్తోంది.తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, హైదరాబాద్ పోలీసు కమాండ్ కంట్రోల్ భవనాలు కూడా షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మిస్తోంది.


Updated Date - 2022-06-28T15:17:08+05:30 IST