విషాదం: షాపూర్ తండా వాగు ఉధృతం.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-09-16T23:56:34+05:30 IST

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో మర్పల్లి మండలం షాపూర్ తండాలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది

విషాదం: షాపూర్ తండా వాగు ఉధృతం.. ఒకరి మృతి

వికారాబాద్: జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో మర్పల్లి మండలం షాపూర్ తండాలో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వాగులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ముగ్గురిని తండా వాసులు కాపాడారు. షాపూర్‌ తండాకు చెందిన దశరథనాయక్‌ కుటుంబంగా స్థానికులు గుర్తించారు.

Updated Date - 2020-09-16T23:56:34+05:30 IST