రిషికేశ్ ఆశ్రమంలో వైభవంగా శంకర జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-05-17T19:08:48+05:30 IST

విశాఖ: శ్రీ శారదాపీఠం రిషికేశ్ ఆశ్రమంలో శంకర జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిశంకరునికి పీఠాధిపతులు

రిషికేశ్ ఆశ్రమంలో వైభవంగా శంకర జయంతి వేడుకలు

విశాఖ: శ్రీ శారదాపీఠం రిషికేశ్ ఆశ్రమంలో శంకర జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదిశంకరునికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర మాట్లాడుతూ.. ప్రపంచానికే జగద్గురువు ఆదిశంకరాచార్యులు అన్నారు. శంకరాచార్యులు రచించిన భాష్యాన్ని ప్రపంచమంతా అనుసరిస్తోందన్నారు. శంకర భాష్యంపై శాస్త్రవేత్తలు, తాత్వికవేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్నారు. నేటి నుంచి చాతుర్మాస్యం ముగిసే వరకు వేద విద్యార్థులకు శంకర భాష్యాన్ని బోధిస్తామన్నారు. రిషికేశ్ వేదికగా గంగాతీరంలో శంకర జయంతి జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు.


Updated Date - 2021-05-17T19:08:48+05:30 IST