ఫారెన్ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
ABN , First Publish Date - 2021-12-02T23:41:29+05:30 IST
శంషాబాద్ ఎయిర్ఫోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫారెన్ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరిని కష్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ఫోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫారెన్ కరెన్సీ తరలిస్తున్న ఇద్దరిని కష్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల 17.75లక్షల విలువ చేసే నోట్లను స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియా రియల్స్, UAE ధీరమ్స్ను అధికారులు సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.