శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2021-12-28T22:10:09+05:30 IST

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుండి వస్తున్న ఇద్దరు ప్రయాణీకుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీగా బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుండి వస్తున్న ఇద్దరు ప్రయాణీకుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. 412 గ్రాముల బంగారం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడ్డారు. పట్టుకున్న బంగారం విలువ రూ.20 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. పిల్లల దుస్తులు, అయస్కాంతపు కడియంలో బంగారం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-12-28T22:10:09+05:30 IST