ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-09-04T02:44:15+05:30 IST
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో మరో సారి భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున షార్జా నుంచి జీ9-458 విమానంలో శంషాబాద్కు వచ్చిన ప్రయాణికుడు మహ్మద్ రఫీక్ బ్యాగులను కస్టమ్స్ అధికారులు తఖీలు చేయగా కేజీ బంగారం లభ్యమైంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు లేకపోవడంతో కేసు నమోదు చేశారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.43 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.