కోతుల దాడి: రెండవ అంతస్థు నుంచి కిందపడిన బీజేపీ నేత భార్య... సంఘటనా స్థలంలో మృతి!

ABN , First Publish Date - 2021-09-08T17:03:23+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో కోతుల దాడి కారణంగా...

కోతుల దాడి: రెండవ అంతస్థు నుంచి కిందపడిన బీజేపీ నేత భార్య... సంఘటనా స్థలంలో మృతి!

షామ్లీ: ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీలో కోతుల దాడి కారణంగా బీజేపీ నేత భార్య మృతి చెందారు. షామ్లీ పరిధిలోని కైరానాలో కోతుల దాడులు అధికమైపోయాయి. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే బీజేపీ నేత అనిల్ చౌహాన్ భార్య, పంచాయతీ మాజీ సభ్యురాలు సుష్మా చౌహాన్ మృతి చెందారనే వాదన వినిపిస్తోంది. 


వివరాల్లోకి వెళితే సుష్మా ఉదయం ఆలయానికి వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చేసరికి అక్కడ కోతుల గుంపు చేరింది. షుష్మా వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తుండగా, అవి ఆమెపై దాడి చేశాయి. దీంతో ఆమె పట్టుతప్పి రెండవ అంతన్థు నుంచి కాలుజారి కింద పడ్డారు. వెంటనే ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-08T17:03:23+05:30 IST