ఆరో వికెట్ కోల్పోయిన కివీస్.. పట్టుబిగిస్తున్న భారత్

ABN , First Publish Date - 2021-06-23T01:15:55+05:30 IST

డబ్ల్యూటీసీ పైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత జట్టు పట్టుబిగిస్తోంది. షమీ తన బంతులకు పదును పెడుతూ కివీస్

ఆరో వికెట్ కోల్పోయిన కివీస్.. పట్టుబిగిస్తున్న భారత్

సౌతాంప్టన్: డబ్ల్యూటీసీ పైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత జట్టు పట్టుబిగిస్తోంది. షమీ తన బంతులకు పదును పెడుతూ కివీస్ వికెట్లను నేలకూలుస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతున్నాడు. 162 పరుగుల వద్ద కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌ (13)ను పెవిలియన్ పంపడం ద్వారా షమీ తన ఖాతాలో మూడో వికెట్‌ను వేసుకున్నాడు. మరోవైపు క్రీజులో పాతుకుపోయిన కెప్టెన్ విలియమ్సన్ భారత బౌర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. బంతులను వృథా చేస్తూ బౌలర్లకు చికాకు తెప్పిస్తున్నాడు.


ప్రస్తుతం 85 ఓవర్లు ముగిశాయి. న్యూజిలాండ్ ఆరు వికెట్లు నష్టానికి 179 పరుగులు చేసింది. విలియమ్సన్ 32, జెమీసన్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ కంటే ఇంకా 38 పరుగులు వెనుకబడి ఉంది. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లలో షమీకి మూడు దక్కగా, ఇషాంత్ రెండు, అశ్విన్ ఒకటి పడగొట్టాడు.

Updated Date - 2021-06-23T01:15:55+05:30 IST