జాతీయ జెండాకు అవమానం
ABN , First Publish Date - 2021-01-27T05:03:26+05:30 IST
సూళ్లూరుపేటలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. కాంగ్రెస్ నాయకులు జెండాను తిరగేసి ఎగురవేశారు.
తిరగేసి ఎగరేసిన కాంగ్రెస్ నేతలు
సూళ్లూరుపేట, జనవరి 26 : సూళ్లూరుపేటలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాకు అవమానం జరిగింది. కాంగ్రెస్ నాయకులు జెండాను తిరగేసి ఎగురవేశారు. స్థానిక కాంగ్రెస్పార్టీ నేతలు, కార్యకర్తలు మంగళవారం ఆర్అండ్బీ బంగ్లాముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేసి వెళ్లారు. ఓ గంట తర్వాత సమీప ట్యాక్సీ స్టాండ్లోని డ్రైవర్లు తలకిందులుగా ఎగురుతున్న జాతీయ పతాకాన్ని గమనించారు. వెంటనే ఆ పతాకాన్ని కిందకుదింపి సరిచేసి తిరిగి ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఇలా నిర్లక్ష్యంగా జాతీయ పతాకాన్ని ఎగురవేయడం విమర్శలకు తావిచ్చింది.