షకీబల్పై మూడు మ్యాచ్ల నిషేధం
ABN , First Publish Date - 2021-06-13T09:36:32+05:30 IST
ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్లో అత్యంత దురుసుగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబల్ హసన్పై నామమాత్రపు చర్యతో సరిపెట్టారు...
ఢాకా: ఢాకా టీ20 ప్రీమియర్ లీగ్లో అత్యంత దురుసుగా ప్రవర్తించిన బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబల్ హసన్పై నామమాత్రపు చర్యతో సరిపెట్టారు. లీగ్లో అతడిని కేవలం మూడు మ్యాచ్ల నిషేధం విధిస్తూ ఢాకా మెట్రోపొలిస్ క్రికెట్ కమిటీ శనివారం నిర్ణయం తీసుకుంది. అలాగే అతడిపై రూ. 4.25 లక్షల జరిమానా కూడా విధించింది. లీగ్లో భాగంగా అబాని లిమిటెడ్ జట్టుతో మ్యాచ్లో మహ్మడన్ స్పోర్టింగ్ జట్టు కెప్టెన్ షకీబల్.. ఓ దశలో సహనం కోల్పోయి వికెట్లను తన్నడంతోపాటు అంపైర్తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.
నా భర్తను విలన్గా చూపిస్తున్నారు
తన భర్త ప్రవర్తనను షకీబల్ భార్య ఉమే అహ్మద్ శిశిర్ సమర్థించడం గమనార్హం. మ్యాచ్లో ప్రధాన అంశాన్ని విస్మరించిన మీడియా.. తన భర్తను విలన్గా చిత్రీకరించేందుకు కుట్ర పన్నిందని ఆమె ఆరోపించింది. ఈ మేరకు శిశిర్ ఫేస్బుక్లో సుదీర్ఘ పోస్ట్ చేసింది.