పెద్ద దిక్కును కోల్పోయాం: శైలజానాథ్

ABN , First Publish Date - 2021-12-05T17:08:36+05:30 IST

రోశయ్య అకాల మరణం రెండు రాష్ట్రలకు తీరని లోటని సాకే శైలజానాథ్ అన్నారు.

పెద్ద దిక్కును కోల్పోయాం: శైలజానాథ్

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అకాల మరణం రెండు రాష్ట్రలకు తీరని లోటని ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ సాకే శైలజానాథ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక శిఖరం కూలినట్లు, ఒక పెద్ద దిక్కును కోల్పోయినట్లు అనిపిస్తోందన్నారు. ప్రజలకు సేవ చేయడమెలా అనేది ప్రభుత్వాలు రోశయ్యను చూసి నేర్చుకోవాలన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేశారని, రోశయ్య ఉపన్యాసం ఉందంటే అందరం హౌస్‌లో ఉండేవాళ్ళమన్నారు. కష్టమైన అంశాన్ని కూడా అందరికి అర్ధమైయ్యేలా సరళంగా చెప్పేవారని, మా తరానికి స్ఫూర్తినిచ్చారన్నారు. కృష్ణా వరదలు వచ్చినప్పుడు వయసు పైబడిన మమ్మల్ని పరుగులు పెట్టించారని శైలజానాథ్ పేర్కొన్నారు. రోశయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి శైలజానాథ్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2021-12-05T17:08:36+05:30 IST