జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదు: శైలజానాథ్

ABN , First Publish Date - 2022-05-01T22:38:19+05:30 IST

సీఎం జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదు: శైలజానాథ్

విజయవాడ: సీఎం జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. దివ్యాంగురాలికి పెన్షన్ రాలేదని అడిగితే.. వారిపైనే కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతపై కేసు పెట్టేందుకు వచ్చిన వ్యక్తిని ఎస్ఐ కొట్టడమే కాకుండా బూతులు తిడతారా అని నిలదీశారు. పీఎస్‌లకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని శైలజానాథ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-05-01T22:38:19+05:30 IST