ఐపీఎల్: ధోనీ, రోహిత్ శర్మలకు షారూక్ ఖాన్ శుభాకాంక్షలు

ABN , First Publish Date - 2020-09-20T00:27:20+05:30 IST

మరికాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభం కాబోతోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్రారంభ మ్యాచ్‌లో

ఐపీఎల్: ధోనీ, రోహిత్ శర్మలకు షారూక్ ఖాన్ శుభాకాంక్షలు

అబుదాబి: మరికాసేపట్లో ఐపీఎల్ 2020 ప్రారంభం కాబోతోంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ప్రారంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని, ప్రముఖ నటుడు షారూక్ ఖాన్ సీఎస్‌కే, ముంబై ఇండియన్స్ జట్ల సారథులు ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలకు శుభాకాంక్షలు తెలిపాడు. హగ్ మాత్రం 6 అడుగుల దూరంలో ఉంటూనే ఇచ్చుకోవాలంటూ భౌతిక దూరం నిబంధనలు గుర్తు చేస్తూ ట్వీట్ చేశాడు. 


కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఈ నెల 23న ముంబై ఇండియన్స్‌తో తొలి మ్యాచ్ వేదిక అయిన అబుదాబిలోనే షేక్ జాయేద్ స్టేడియంలోనే తలపడనుంది. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఇప్పటికే డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. ఐపీఎల్ విజయం వెనక ధోనీ, రోహిత్ శర్మ ఉన్నారని కొనియాడాడు. ఈ రెండు జట్లకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని పేర్కొన్నాడు.  


Updated Date - 2020-09-20T00:27:20+05:30 IST