ఆ విషయంలో మోదీ క్షమాపణ చెప్పాలి: షబ్బీర్ అలీ

ABN , First Publish Date - 2022-05-02T21:22:35+05:30 IST

తెలంగాణను అడ్డగోలుగా విభజించారన్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత..

ఆ విషయంలో మోదీ క్షమాపణ చెప్పాలి: షబ్బీర్ అలీ

కరీంనగర్: తెలంగాణను అడ్డగోలుగా విభజించారన్న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. సోమవారం హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండిసంజయ్ కుమార్ ఏ మొఖం పెట్టుకొని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులకు మోదీ అంటే భయమని అందుకనే ఆయన గురించి మాట్లాడరని షబ్బీర్ అలీ అన్నారు. 

Updated Date - 2022-05-02T21:22:35+05:30 IST