‘సెజ్లో కంపెనీలు లేవు.. జాబులు రావు’
ABN , First Publish Date - 2020-09-29T18:04:06+05:30 IST
పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కేఎస్ఈజెడ్లో పరిశ్రమలు వచ్చే..
కొత్తమూలపేట(కొత్తపల్లి): పరిశ్రమల స్థాపనకు భూములు సేకరించిన కేఎస్ఈజెడ్లో పరిశ్రమలు వచ్చే అవకాశం లేదని తెలుగు జనతాపార్టీ అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తమూలపేట సెజ్ పునరావాస కాలనీలో పలు గృహాలను సోమవారం ఆయన పరిశీలించారు. 13ఏళ్ల కిందట పరిశ్రమలకోసం భూమిని సేకరించారని, తర్వాత జీఎంఆర్కు బదలాయించారని అన్నారు. జీఎంఆర్ తన వాటా భూ ములను అరబిందో ఫార్మాస్యూటికల్కు రూ.2,600కోట్లకు విక్రయించేందుకు రంగం సిద్ధం చేశారన్నారు. దీనిపై తాను సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.