ఆశ్రమం ముసుగులో పిల్లలపై లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2020-07-11T07:29:35+05:30 IST

ఆశ్రమం ముసుగులో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు కూలీలుగా పని చేయమని బలవంతం చేస్తుండడంతో ఉత్తరప్రదేశ్‌ షుకర్తాల్‌ ఆశ్రమ

ఆశ్రమం ముసుగులో పిల్లలపై లైంగిక వేధింపులు

ముజఫర్‌నగర్‌, జూలై 10: ఆశ్రమం ముసుగులో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు కూలీలుగా పని చేయమని బలవంతం చేస్తుండడంతో ఉత్తరప్రదేశ్‌ షుకర్తాల్‌ ఆశ్రమ యజమాని స్వామి భక్తి భూషణ్‌ గోవింద్‌ మహారాజ్‌ను స్థానిక పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. ఆశ్రమంలో పిల్లలను వేధిస్తున్న విషయంపై గుర్తు తెలియని వ్యక్తి ఢిల్లీ చిల్డ్రన్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దాని ఆధారంగా ఈ నెల 7న షుకర్తాల్‌ ఆశ్రమంపై చిల్డ్రన్‌ హెల్ప్‌లైన్‌ సభ్యులు, స్థానిక పోలీసుల బృందం దాడి చేసింది. ఆ సందర్భంగా ఆశ్రమంలోని గోడియా మఠ్‌ నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 10 మంది పిల్లలను రక్షించారు. వీరందరికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో నలుగురు లైంగిక వేధింపులకు గురైనట్లు తేలింది.

Updated Date - 2020-07-11T07:29:35+05:30 IST