దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి

ABN , First Publish Date - 2020-11-29T05:53:34+05:30 IST

కాకినాడ నగరం గోళీలపేటలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు.

దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి

  • కాకినాడ కలెక్టరేట్‌ వద్ద ఐద్వా, ప్రజాసంఘాల ధర్నా

భానుగుడి(కాకినాడ), నవంబరు 28: కాకినాడ నగరం గోళీలపేటలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్‌ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారిని పరామర్శించడానికి వచ్చిన స్త్రీ, శిశుసంక్షేమ మంత్రి తేనేటి వనితతోపాటుగా ఎంపీ వంగా గీత, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్‌ రమణి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎం.వీరలక్ష్మి మాట్లాడుతూ దీనిపై కఠినంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో దూసర్లపూడి రమణరాజు, జమతేఇస్లాం నాయకులు ఇబ్రహీం, హసన్‌ షరీఫ్‌, పిట్టా వరప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-11-29T05:53:34+05:30 IST