బీబీనగర్లో పలు రైళ్ల నిలిపివేత
ABN , First Publish Date - 2021-12-12T02:09:58+05:30 IST
బీబీనగర్, పగిడిపల్లి రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను
భువనగిరి: బీబీనగర్, పగిడిపల్లి రైల్వే స్టేషన్లలో పలు రైళ్లను నిలిపివేశారు. సిగ్నల్ ఇవ్వక ముందే విశాఖ ఎక్స్ప్రెస్ వెళ్లింది. దీంతో పగిడిపల్లి స్టేషన్ దగ్గర గోదావరి, చెన్నై ఎక్స్ప్రెస్లను నిలిపివేశారు. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ - గుంటూరు మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో సాంకేతిక లోపమే కారణమని అధికారులు చెప్పారు.