బ్రిటన్‌లో రెండు Trains ఢీ: పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2021-11-01T13:28:38+05:30 IST

బ్రిటన్ దేశంలోని సాలిస్‌బరీలోని ఫిషర్టన్ టన్నెల్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి...

బ్రిటన్‌లో రెండు Trains ఢీ: పలువురికి గాయాలు

లండన్:  బ్రిటన్ దేశంలోని సాలిస్‌బరీలోని ఫిషర్టన్ టన్నెల్ వద్ద రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాద ఘటనలో పలువురు గాయపడినట్లు బ్రిటిష్ రవాణా పోలీసులు తెలిపారు.పోర్ట్స్‌మౌత్- బ్రిస్టల్ ల మధ్య ప్రయాణిస్తున్న రైలు, లండన్‌లోని వాటర్‌లూ స్టేషన్ నుంచి హోనిటన్‌కు వస్తున్న మరో రైలును ఢీకొన్నట్లు గ్రేట్ వెస్ట్రన్ రైల్వే తెలిపింది.ఈ ప్రమాదంలో రైలు డ్రైవరుతో సహా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని బ్రిటన్ పోలీసులు చెప్పారు. సాలిస్ బరీ స్టేషను సమీపంలోని సంఘటన స్థలానికి అగ్నిమాపకశాఖ ట్రక్కులు, అంబులెన్సులు వచ్చి రైలులో ఉన్న 100 మంది ప్రయాణికులను కాపాడారు.ఈ రైలు ప్రమాదంతో నవంబర్ 2 వతేదీ వరకు రైళ్ల రాకపోకల్లో అంతరాయం కలుగుతుందని నైరుతి రైల్వే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.


Updated Date - 2021-11-01T13:28:38+05:30 IST