ఢిల్లీలో కాల్పులు..పలువురికి గాయాలు

ABN , First Publish Date - 2022-02-03T13:10:41+05:30 IST

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి....

ఢిల్లీలో కాల్పులు..పలువురికి గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.పరస్పర శత్రుత్వం కారణంగా రెండుగ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు. కాల్పుల అనంతరం దుండగులు పరార్ అయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఢిల్లీ పోలీసులు కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-02-03T13:10:41+05:30 IST