Stampede: ఉజ్జయినిలో భక్తుల తొక్కిసలాట... పలువురికి గాయాలు!
ABN , First Publish Date - 2021-07-27T14:53:53+05:30 IST
మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో
ఉజ్జయిని: మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు మహిళలు, పిల్లలు గాయపడ్డారు. భక్తులు తెలిపిన వివరాల ప్రకారం ఆలయంలోని మహేశ్వరుణ్ణి దర్శించుకునేందుకు వచ్చిన వీఐపీలతో పాటు సామాన్య భక్తులు కూడా ఒకేసారి చొచ్చుకురావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో పరిస్థితి అదుపుతప్పింది.
శ్రావణమాసం తొలి సోమవారం నాడు ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతితోపాటు పలువురు వీఐపీలు ఆలయ సందర్శనకు వచ్చారు. కాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఉన్నదాని ప్రకారం ఆలయానికి సంబంధించిన నాల్గవ గేటు వద్ద తొక్కిసలాట జరిగింది. అయితే పెద్ద ప్రమాదమేమీ జరగకపోవడం విశేషం. ఈ ఘటనలో పలువురు పోలీసులు కూడా గాయపడటం గమనార్హం.
City Channel సౌజన్యంతో....