Biharలో పిడుగుపాటుకు 17 మంది మృతి

ABN , First Publish Date - 2022-06-20T13:46:54+05:30 IST

బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది మృత్యువాత పడ్డారు...

Biharలో పిడుగుపాటుకు 17 మంది మృతి

పట్నా(బీహార్): బీహార్ రాష్ట్రంలో పిడుగుపాటుకు 17 మంది మృత్యువాత పడ్డారు. భాగల్పూర్ జిల్లాలో గరిష్టంగా పిడుగుపాటుకు ఆరుగురు మరణించారు. వైశాలి జిల్లాలో ముగ్గురు, బంకా, ఖగారియా,ముంగేర్, కతిహార్, మాధేపురా, సహర్సా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు ప్రాణాలు వదిలారు.శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో భారీవర్షాలు కురవడంతో 17 మంది మరణాలు సంభవించాయి. బీహార్ రాష్ట్రంలో గత ఏడాది కూడా పిడుగు పాటుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.బీహార్‌లో పిడుగులు పడి 17 మంది మృతి చెందడం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పిడుగుపాటుకు మరణించిన ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.


Updated Date - 2022-06-20T13:46:54+05:30 IST