ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
ABN , First Publish Date - 2022-07-03T06:00:34+05:30 IST
ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
ఆదిభట్ల, జూలై 2: పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఆదిభట్ల పోలీసులు తెలిపారు. నాదర్గుల్లో పేకాట ఆడుతున్నట్లు ఎస్వోటీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించగా పేకాట ఆడుతున్న బి.భాస్కర్, జె.ఆగమయ్య, కొమురయ్య, జంగయ్య, జ్ఞానేశ్వర్, పర్వతాలు, సిరాజ్లను అరెస్టు చేసి వారి నుంచి రూ.లక్షా 1940 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.