Road accident : ట్రక్కును ఢీకొట్టిన బస్సు...ఏడుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2022-09-12T16:16:04+05:30 IST

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది....

Road accident : ట్రక్కును ఢీకొట్టిన బస్సు...ఏడుగురి దుర్మరణం

కోర్బా(ఛత్తీస్‌గఢ్)‌: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh) రాష్ట్రంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. కోర్బా జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.వేగంగా వస్తున్న బస్సు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది.(bus rams into truck) ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు.ఈ ప్రమాదంలో మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మడాయి ఘాట్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని కోర్బా జిల్లా ఎస్పీ సంతోష్ సింగ్ చెప్పారు. 


బస్సు ప్రయాణికులతో కోర్బా నుంచి రాయపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల కుటుంబాలకు ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బాగేల్(Chhattisgarh chief minister Bhupesh Baghel) సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. 


Updated Date - 2022-09-12T16:16:04+05:30 IST