Ludhiana గుడిసెలో చెలరేగిన మంటలు...ఏడుగురి సజీవదహనం

ABN , First Publish Date - 2022-04-20T14:45:52+05:30 IST

పంజాబ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు....

Ludhiana గుడిసెలో చెలరేగిన మంటలు...ఏడుగురి సజీవదహనం

లూథియానా (పంజాబ్): పంజాబ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు.లూథియానా నగరంలో ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో కుటుంబంలోని ఏడుగురు సజీవదహనమయ్యారు. వారు వలస కూలీలని, ఇక్కడి టిబ్బా రోడ్డులోని మున్సిపల్ చెత్త డంప్ యార్డు సమీపంలోని తమ గుడిసెలో నిద్రిస్తున్నారని అధికారులు తెలిపారు.మునిసిపల్ చెత్త డంప్ యార్డ్ సమీపంలోని తమ గుడిసెలో నిద్రిస్తుండగా అగ్నిప్రమాదం జరిగిందని లూథియానా అసిస్టెంట్ కమిషనర్ (ఈస్ట్) సురీందర్ సింగ్ తెలిపారు.టిబ్బా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రణబీర్ సింగ్ సంఘటన స్థలానికి వచ్చారు. మృతుల్లో దంపతులతోపాటు వారి ఐదుగురు పిల్లలుగా గుర్తించారు. వారి పేర్లు ఇంకా నిర్ధారించలేదు.అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.


Updated Date - 2022-04-20T14:45:52+05:30 IST