Yamuna Expresswayపై ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2022-05-07T14:24:09+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నగర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు....

Yamuna Expresswayపై ఘోర రోడ్డు ప్రమాదం...ఏడుగురి మృతి

మధుర (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర నగర సమీపంలోని యమునా ఎక్స్‌ప్రెస్ వేపై శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మథురలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై శనివారం ఉదయం ప్రయాణిస్తున్న వ్యాగన్‌ఆర్ కారు మరో వాహనాన్ని ఢీకొంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు.ఈ రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.


Read more