bus accident : పెళ్లి బృందంలో ఏడుగురి దుర్మరణం

ABN , First Publish Date - 2021-07-19T14:58:11+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం...

bus accident : పెళ్లి బృందంలో ఏడుగురి దుర్మరణం

పదిమందికి గాయాలు

ఆగ్రా (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం చెందారు. పెళ్లికి వెళ్లి తిరిగి బస్సులో వస్తుండగా ఆగ్రా-మొరాదాబాద్ జాతీయ రహదారిపై సంభాల్ జిల్లా లహారావణ్ గ్రామం వద్ద టైరు పంక్చరవడంతో నిలిపివేశారు.బస్సుకు పంక్చర్ వేస్తుండగా ప్రయాణికులు బస్సు దిగి రోడ్డు పక్కన నిలబడ్డారు. అంతలో జాతీయ రహదారిపై వేగంగా వస్తున్న బస్సు నిలిచి ఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఏడుగురు మరణించగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను బహజోయ్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవరు, కో డ్రైవర్లు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-07-19T14:58:11+05:30 IST