లోక్ అదాలత్తో కేసులకు పరిష్కారం
ABN , First Publish Date - 2020-11-29T04:35:18+05:30 IST
క్రిమినల్, సివిల్ కేసుల రాజీ పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని రెండో అదనపు జిల్లా జడ్జి, మండల న్యా య సేవా కమిటీ చైర్మన్ సీహెచ్ రాజగోపాలరావు అన్నారు.
బెలగాం :
క్రిమినల్, సివిల్ కేసుల రాజీ పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ మంచి అవకాశమని రెండో అదనపు జిల్లా జడ్జి, మండల న్యా య సేవా కమిటీ చైర్మన్ సీహెచ్ రాజగోపాలరావు అన్నారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ డిసెంబరు 12న పార్వతీపురం కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించ నున్నట్టు చెప్పారు. ఈ అవకాశాన్ని ఇరువర్గాల వారు వినియోగించుకో వాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ కుమారి ఎం.విజయరామేశ్వరి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎన్.శ్రీనివాస రావు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, పోలీసులు పాల్గొన్నారు.