అధిక ధరలతో ప్రజలపై వడ్డింపులు

ABN , First Publish Date - 2021-02-27T05:05:01+05:30 IST

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు మండ్రగబ్బ, తేలు పాత్రలను పోషిస్తూ.. అధిక ధరలతో ప్రజలపై వడ్డింపులకు దిగాయని పీసీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అధిక ధరలతో ప్రజలపై వడ్డింపులు
మాట్లాడుతున్న పీసీసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి

జగన్‌ ప్రభుత్వంలో త్వరలో జుట్టు, గడ్డం పన్నులు తధ్యం

పీసీసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  తులసిరెడ్డి


కడప(కలెక్టరేట్‌), ఫిబ్రవరి 26 : కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాలు మండ్రగబ్బ, తేలు పాత్రలను పోషిస్తూ.. అధిక ధరలతో ప్రజలపై వడ్డింపులకు దిగాయని పీసీపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌  తులసిరెడ్డి  తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో శుక్రవారం  జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు, నగర అధ్యక్షుడు విష్ణుప్రీతం రెడ్డిలతో కలసి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వ హయాంలో పెట్రోల్‌, డీజల్‌ ధరలు సెంచరీ కొడుతుండగా, వంట గ్యాస్‌ ధర మాత్రం ఏకంగా పదవ సెంచరీకి చేరువైందన్నారు. ఎన్నికల అనంతరం ఏప్రిల్‌ 1 నుంచి నగర, పట్టణ ప్రాంతాల్లో ఆస్థి పన్ను, నీటి పన్ను, మురుగు నీటి పన్నులు విపరీతంగా పెంచి అదికారం కట్టబెట్టిన ప్రజల నడ్డి విరిచేందుకు సిద్దమమయ్యారని విమర్శించారు. జగన్‌రెడ్డి పాలనలో జుట్టు పన్ను, గడ్డం పన్నులు తథ్యమని జోస్యం చెప్పారు,. కీలుబొమ్మ పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీ అభ్యర్ధులను జరగనున్న ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడించి కాంగ్రెస్‌ అభ్యర్థులను గెలిపించాలని తులసిరెడ్డి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు లక్షుమయ్య, తిరుమలేశు, లావణ్య, సి.పుల్లయ్య, అసిఫ్‌ అలీఖాన్‌  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-27T05:05:01+05:30 IST