సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలి
ABN , First Publish Date - 2021-01-27T06:32:43+05:30 IST
ట్రస్టు తరుపున సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వేములవాడలో రాజరాజేశ్వర ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం సహస్ర లింగార్చన, అనువంశిక బ్రాహ్మణ చరిత్ర ఈ-పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
వేములవాడ, జనవరి 26 : ట్రస్టు తరుపున సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు. వేములవాడలో రాజరాజేశ్వర ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం సహస్ర లింగార్చన, అనువంశిక బ్రాహ్మణ చరిత్ర ఈ-పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రస్టు సేవా కార్యక్రమాలు అభినందనీయమని, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ సైతం సేవా కార్యక్రమాలలో ముందుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా సంకేపల్లి నాగేంద్రశర్మ రచించిన అనువంశిక బ్రాహ్మణ చరిత్ర ఈ-పుస్తకాన్ని ప్రముఖ సినీనటుడు కోట శంకర్రావు, ఎస్పీ రాహుల్ హెగ్డే ఆవిష్కరించారు. ట్రస్టు అధ్యక్షుడు మామిడిపెల్లి రాజన్న, కార్యదర్శి రాగంపేట హరిబాబు, ఉపాధ్యాయుల సాంబశివుడు తదితరులు పాల్గొన్నారు.