పోలీసు శాఖలో పలువురికి సేవా పతకాలు
ABN , First Publish Date - 2021-01-27T05:26:34+05:30 IST
నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీసు స్టేషన్లలో వివిధ విభాగాల్లో పని చే స్తున్న పోలీసులకు ఉత్తమ సేవా పతకాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి అందజేశారు.
ఖిల్లా, జనవరి 26 : నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆయా పోలీసు స్టేషన్లలో వివిధ విభాగాల్లో పని చే స్తున్న పోలీసులకు ఉత్తమ సేవా పతకాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి అందజేశారు. మంగళవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు పరేడ్గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వారికి కలెక్టర్ పతకాలను, ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం వారిని అభినందించారు. పతకాలను అందుకున్న వారిలో నిజామాబాద్ ఏసీపీ జి.శ్రీనివాస్కుమార్, ఎస్సైలు ఎం. రాములు, ఎండీ సలీం, హెడ్కానిస్టేబుళ్లు జె. రాంచందర్, బి.గంగారాం, ఏఎస్సైలు కే.కృష్ణమూర్తి, శంకరప్ప, ఏఆర్హెడ్కానిస్టేబుల్ కిషన్సింగ్, ఏఎస్సై రామయ్య, నరేందర్, గురువప్ప, మహిళా ఎస్సై రాజశ్రీ, విఠల్, ఏఎస్సై ఇషాఖ్ర్యాలీ, హెడ్కానిస్టేబుల్ సుదర్శన్గౌడ్, ఏఆర్ఎస్ఐ మురళీ ఉన్నారు.