అమరవీరుల స్ఫూర్తితో వినియోగదారులకు సేవలు చేద్దాం
ABN , First Publish Date - 2021-01-27T05:22:05+05:30 IST
స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు సాగుదామని సదరన్డిస్కం సీఎండీ హెచ్.హరనాథరావు పిలుపునిచ్చారు.
సదరన్ డిస్కం సీఎండీ హరనాథరావు పిలుపు
తిరుపతి(ఆటోనగర్), జనవరి 26: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు సాగుదామని సదరన్డిస్కం సీఎండీ హెచ్.హరనాథరావు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తిరుపతిలోని సదరన్ డిస్కం కార్యాలయం ఎదుట జెండా ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కళాధర్రావు, వనజ, సీజీఎం సుబ్బరాజు, హనుమత్ప్రసాద్, జీఎం రాధాజయశ్రీ, అయూబ్ఖాన్, సత్యనారాయణ, భాస్కర్రెడ్డి, సురేంద్ర, ఈఈలు ఎం కృష్ణారెడ్డి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్లో డైరెక్టర్ నాగరమణశర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పేదలకు దుస్తులు వితరణ చేశారు.