అమరవీరుల స్ఫూర్తితో వినియోగదారులకు సేవలు చేద్దాం

ABN , First Publish Date - 2021-01-27T05:22:05+05:30 IST

స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు సాగుదామని సదరన్‌డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు పిలుపునిచ్చారు.

అమరవీరుల స్ఫూర్తితో   వినియోగదారులకు సేవలు చేద్దాం
జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్న సదరన్‌ డిస్కం సీఎండీ హరనాథరావు

సదరన్‌ డిస్కం సీఎండీ హరనాథరావు పిలుపు 

తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 26: స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను ఆదర్శంగా తీసుకుని విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు సాగుదామని సదరన్‌డిస్కం సీఎండీ హెచ్‌.హరనాథరావు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తిరుపతిలోని సదరన్‌ డిస్కం కార్యాలయం ఎదుట జెండా ఎగురవేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కళాధర్‌రావు, వనజ, సీజీఎం సుబ్బరాజు, హనుమత్‌ప్రసాద్‌, జీఎం రాధాజయశ్రీ, అయూబ్‌ఖాన్‌, సత్యనారాయణ, భాస్కర్‌రెడ్డి, సురేంద్ర, ఈఈలు ఎం కృష్ణారెడ్డి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్‌లో డైరెక్టర్‌ నాగరమణశర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పేదలకు దుస్తులు వితరణ చేశారు. 

Updated Date - 2021-01-27T05:22:05+05:30 IST