వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్ సీఈవో

ABN , First Publish Date - 2021-01-16T20:42:25+05:30 IST

దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వ్యాక్సిన్ వేయించుకున్న సీరమ్ సీఈవో

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమం ఇవాళ ప్రారంభమైన విషయం తెలిసిందే. వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే, వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల్లో ఒకరైన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో ఆదర్ పూనావాలా కూడా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలుపుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమంటూ ప్రధాని, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తాము ఉత్పత్తి చేసిన ‘కోవిషీల్డ్’ ఈ కార్యక్రమంలో భాగం కావడం చరిత్రాత్మకం అన్నారు. హెల్త్ వర్కర్లతో పాటు తాను వ్యాక్సిన్ వేయించున్నానని తెలిపారు.    



Updated Date - 2021-01-16T20:42:25+05:30 IST