పీసీసీ రేసులో నేను సీరియస్ గానే ఉన్నా: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-02-15T01:06:52+05:30 IST

పీసీసీ రేసులో తాను సీరియస్ గానే ఉన్నానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చెప్పారు. పీసీసీ అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ నేత కుంతియాను కోరానని తెలిపారు.

పీసీసీ రేసులో నేను సీరియస్ గానే ఉన్నా: జగ్గారెడ్డి

హైదరాబాద్: పీసీసీ రేసులో తాను సీరియస్ గానే ఉన్నానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి చెప్పారు. పీసీసీ అవకాశం ఇవ్వాలని ఏఐసీసీ నేత కుంతియాను కోరానని తెలిపారు. నెలాఖరులో సోనియా, రాహుల్‌ను కలుస్తామని చెప్పారు. ఎమోషనల్‌ పాలిటిక్స్‌ ఇప్పుడు నడవవని, ప్రజల నాడీ బట్టి పని చేయాలన్నారు. డబ్బు, అభివృద్ధి కోణంలోనే రాజకీయ వ్యూహం ఉండాలన్నారు. సీనియర్లు, జూనియర్లు కలిస్తేనే అధికారంలోకి రాగలుగుతామని తెలిపారు. ప్రజలు ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ వైపు చూస్తున్నారని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-02-15T01:06:52+05:30 IST