కేంద్రం వైఖరితో తెలంగాణకి తీవ్ర అన్యాయం: మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-02-03T22:37:56+05:30 IST
కేంద్రం వైఖరితో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతోందని
సిరిసిల్ల: కేంద్రం వైఖరితో తెలంగాణకి తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. పట్టణంలో ఆయన మాట్లాడారు. నేతన్నలను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరితే స్పందన లేదన్నారు. దున్నపోతు మీద వాన పడ్డట్లుగా కేంద్రం తీరు ఉందన్నారు. ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినా తెలంగాణకు ఏమీ ఇవ్వలేదన్నారు. కేంద్రం జీఎస్టీ వేసి వస్త్ర పరిశ్రమను దెబ్బతీస్తోందని ఆయన ఆరోపించారు.