రోడ్డు ప్రమాదంలో ఆర్టీఏ సభ్యుడికి తీవ్ర గాయాలు
ABN , First Publish Date - 2021-10-20T07:46:00+05:30 IST
రోడ్డు ప్రమాదంలో ఆలేరుకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రోడ్డు రవాణా అథారిటీ సభ్యుడు పంతం కృష్ణ గాయ పడ్డారు.
ఆలేరు, అక్టోబరు 19: రోడ్డు ప్రమాదంలో ఆలేరుకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, రోడ్డు రవాణా అథారిటీ సభ్యుడు పంతం కృష్ణ గాయ పడ్డారు. యాదగిరి గుట్ట మండలం బాహుపేట స్టేజీ సమీపంలో మూల మలుపు వద్ద సోమవారం రాత్రి 10 గంటల సమయంలో తన బైక్ను మలుపు తిప్పుతుండగా, హైదరాబాద్ నుంచి వరంగల్కు వెళ్తున్న లారీ ఢీకొట్టింది, ఈ ప్రమాదంలో కృష్ణ తలకు, కుడి చేతికి తీవ్ర గాయాల య్యాయి. ఆయనను స్థానికులు అంబులెన్స్ ద్వారా ఆలేరులోని ఆసుప త్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తర లించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణను డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడి, మునిసిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్ రాములు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మల్లేశంలు పరామర్శించారు.