వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్రగాయాలు

ABN , First Publish Date - 2020-09-25T11:26:08+05:30 IST

మండలంలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు... కడప నుంచి రామాపురానికి ఏపీ39 సీఎన్‌1417 నెంబరు గల

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి తీవ్రగాయాలు

రామాపురం, సెప్టెంబరు 24: మండలంలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు... కడప నుంచి రామాపురానికి ఏపీ39 సీఎన్‌1417 నెంబరు గల మోటార్‌ బైక్‌లో గోపీ, జయసుధ అనే భార్య భర్తలు వస్తుండగా దర్గా రోడ్డు వద్దకు రాగానే వెనుకవైపు నుంచి మరో మోటారుబైక్‌ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో భార్యా, భర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్‌లో వచ్చిన ముగ్గురిలో బైక్‌ నడిపిన ముబారక్‌కు తీవ్రంగా గాయపడ్డాడు. వీరి ని స్థానిక పోలీసులు కడప రిమ్స్‌కు తరలించారు. అలాగే లక్కిరెడ్డిపల్లె మండలం యర్రగుడి వడ్డెపల్లెకు చెందిన ఈశ్వరయ్యను స్థానిక గౌతమ్‌ హైస్కూల్‌ వద్ద గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వాహనం ఢీకొ నడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతన్ని 108 వాహనంలో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రామాపురం ఎస్‌ఐ మైనుద్దీన్‌  తెలిపారు. 

Updated Date - 2020-09-25T11:26:08+05:30 IST