సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలు

ABN , First Publish Date - 2021-12-06T05:30:00+05:30 IST

మండలం లోని వంకమర్రి సగిలేరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదశాత్తు స్కూటర్‌ నుంచి కింద పడటంతో ఝాన్సీ లక్ష్మి అనే సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి.

సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలు
ప్రమాదంలో గాయపడిన ఝాన్సీ లక్ష్మి

కాశినాయన, డిసెంబర్‌ 6: మండలం లోని వంకమర్రి సగిలేరు బ్రిడ్జి సమీపంలో ప్రమాదశాత్తు స్కూటర్‌ నుంచి కింద పడటంతో ఝాన్సీ లక్ష్మి అనే సచివాలయ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పిట్టిగుంట గ్రామానికి చెందిన ముత్తుముల ఝాన్సీ లక్ష్మి మైదు కూరు నియోజకవర్గంలోని ఆదిరెడ్డి పల్లె గ్రామ సచివాలయంలో హార్టి కల్చర్‌ విలేజ్‌ అసిస్టెంట్‌గా పనిచే స్తోంది. సోమవారం విధి నిర్వహ ణలో భాగంగా తోటి ఉద్యోగినితో కలసి కార్యాలయానికి ద్విచక్రవాహనంపై వెళు తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి పడిపోయింది. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను స్థానికుల సహాయంతో 108 వాహనంలో పోరు మామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Updated Date - 2021-12-06T05:30:00+05:30 IST