రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
ABN , First Publish Date - 2022-05-23T05:50:49+05:30 IST
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
షాద్నగర్రూరల్, మే 22: షాద్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బూర్గుల గేట్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కడియాలకుంట తండాకు చెందిన పాత్లావత్ రమే్షనాయక్ గ్రామం నుంచి షాద్నగర్ వెళ్లేందుకు బూర్గుల గేట్ వద్ద రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి జడ్చర్ల వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొనడంతో రమేష్ తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ నవీన్కుమార్ తెలిపారు.