Crime: నడిరోడ్డు మీద పడి ఉన్న మూట.. దానిలో ఏముందో చూసి నివ్వెరపోయిన స్థానికులు.. పోలీసులు కూడా షాక్..!

ABN , First Publish Date - 2022-08-13T20:25:10+05:30 IST

శుక్రవారం ఉదయం ఏడు గంటలు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీరట్ లఖీంపుర మెయిన్ రోడ్డు..

Crime: నడిరోడ్డు మీద పడి ఉన్న మూట.. దానిలో ఏముందో చూసి నివ్వెరపోయిన స్థానికులు.. పోలీసులు కూడా షాక్..!

శుక్రవారం ఉదయం ఏడు గంటలు.. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మీరట్ లఖీంపుర మెయిన్ రోడ్డు.. రోడ్డు మధ్యలో ఏదో మూట పడి ఉండడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.. దానిని ఓపెన్ చేసి చూడగా లోపల ఓ యువతి మృతదేహం ఉంది.. నివ్వెరపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మూటలోని మృతదేహాన్ని బయటకు తీసి షాకయ్యారు.. ఎందుకంటే తల లేకుండా కేవలం మొండెం మాత్రమే ఆ మూటలో ఉంది.. మీరట్‌లో ఈ తరహా కేసు ఈ మధ్య కాలంలో ఇది మూడోది కావడం విషాదకరం. 


ఇది కూడా చదవండి..

Cat saves toddler: చిన్నారిని పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన పిల్లి.. వీడియో వైరల్!


ఆ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు పోలీసులు శ్రమపడుతున్నారు. ఇదే తరహాలో జులై 6వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు మీరట్‌లోని దోగ్రా ఆలయం పక్కన కాలువలో ఉన్న మృతదేహం గురించి పోలీసులకు సమాచారం అందింది. ఆ యువతి మృతదేహానికి కూడా తల లేదు. ఆ మృతదేహానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులే ఖననం చేశారు. అలాగే 2020 అక్టోబర్ 26న కూడా ఓ యువతి మృతదేహం ఇదే స్థితిలో లభ్యమైంది. 


మృతదేహాన్ని 15 ముక్కలుగా కోసేసి గోనె సంచిలో వేసి కుట్టేశారు. ఆ మూటలో కూడా తల లేదు. ఆ కేసుకు ఇప్పటి రెండు ఘటనలకు సంబంధం ఉండి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సీరియల్ కిల్లింగ్స్ స్థానికుల్లో భయాందోళనలు రేపుతున్నాయి. పోలీసులు త్వరగా నిందితులను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2022-08-13T20:25:10+05:30 IST