గురుగ్రామ్‌లో సీరియల్ కిల్లర్ అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-05T16:48:57+05:30 IST

మూడు రాత్రుల్లో ముగ్గురు వ్యక్తులను అత్యంత దారుణంగా హత్య చేసిన 22 ఏళ్ల సీరియల్ కిల్లర్ ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు.....

గురుగ్రామ్‌లో సీరియల్ కిల్లర్ అరెస్ట్

గురుగ్రామ్ : మూడు రాత్రుల్లో ముగ్గురు వ్యక్తులను అత్యంత దారుణంగా హత్య చేసిన 22 ఏళ్ల సీరియల్ కిల్లర్ ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. బీహార్ నివాసి మహ్మద్ రాజిని గురుగ్రామ్ లోని ఇఫ్కో చౌక్ సమీపంలో పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ రాజి నవంబరు 23,  24, 25 తేదీల్లో ముగ్గురిని హత్య చేశానని పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడు బాధితులకు మద్యం తాగించి ఆపై వారిని కత్తితో పొడిచి చంపేశాడని పోలీసులు చెప్పారు. నవంబరు 23న గురుగ్రామ్ లీజర్ వ్యాలీ పార్కులో నిందితుడు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. 


నవంబరు 24న నిందితుడు గురుగ్రామ్ సెక్టారు 40లో సెక్యూరిటీ గార్డును చంపాడు. నవంబరు 25వతేదీన రాకేష్ కుమార్ ను హతమార్చాడు. రాకేష్ కుమార్ మృతదేహాన్ని గురుగ్రామ్ సెక్టారు 47లో కనుగొన్నారు. రాకేష్ కుమార్ గొంతు కోసి తలను కన్లె గ్రామంలోని నిర్జన ప్రదేశంలో పడేశాడు.తాను ఏం చేయగలనో ప్రపంచానికి చూపించేందుకే తాను హత్యలు చేశానని నిందితుడు పోలీసుల ముందు అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేయడానికి పోలీసులు 300 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. సీరియల్ కిల్లర్ బీహార్ లోనూ పలువురిని హతమార్చి ఉండవచ్చని దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. 

Updated Date - 2020-12-05T16:48:57+05:30 IST