సెప్టెంబరు 30వరకూ రెగ్యులర్‌ రైళ్లన్నీ రద్దు

ABN , First Publish Date - 2020-08-11T15:15:21+05:30 IST

కొవిడ్‌ -19 లాక్‌డౌన్‌ వల్ల రద్దు చేసిన రెగ్యులర్‌ రైళ్లను ఇంకా..

సెప్టెంబరు 30వరకూ రెగ్యులర్‌ రైళ్లన్నీ రద్దు

రాజమహేంద్రవరం(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ -19 లాక్‌డౌన్‌  వల్ల రద్దు చేసిన రెగ్యులర్‌ రైళ్లను ఇంకా నడపడంలేదు. సెప్టెంబర్‌ 30వ తేదీ వరకూ ఈ రైళ్ల రాకపోకలన్నీ రద్దు చేసినట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లు మాత్రమే నడుస్తాయి. జిల్లాలో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ మినహా అన్నీ మూసివేసిన సంగతి తెలిసిందే. జిల్లాలోని ప్రయాణికులంతా రాజమహేంద్రవరం స్టేషన్‌ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. రోజుకు సుమారు వెయ్యి నుంచి 1200 వరకూ మాత్రమే ప్రయాణికులు ఉండడం గమనార్హం.


Updated Date - 2020-08-11T15:15:21+05:30 IST