Chief Minister: 3న కేరళకు స్టాలిన్‌

ABN , First Publish Date - 2022-08-21T16:31:53+05:30 IST

కేరళ రాష్ట్రం తిరువంతపురం(Thiruvananthapuram)లో సెప్టెంబరు 3వ తేదీ జరుగనున్న దక్షిణ మండల కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి ఎంకే స్టా

Chief Minister: 3న కేరళకు స్టాలిన్‌

అడయార్‌(చెన్నై), ఆగస్టు 20: కేరళ రాష్ట్రం తిరువంతపురం(Thiruvananthapuram)లో సెప్టెంబరు 3వ తేదీ జరుగనున్న దక్షిణ మండల కౌన్సిల్‌లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పాల్గొననున్నారు. ఈ కౌన్సిల్‌లో తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, అండమాన్‌-నికోబార్‌ దీవులున్నాయి. ఏటా నిర్వహించే ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. సమావేశంలో ముల్లైపెరియార్‌, కావేరి సహా పలు సమస్యలపై రాష్ట్ర హక్కులను సీఎం తెలుపనున్నారు. బీజేపీ యేతర పార్టీలు అధికారంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలు కలిసే ఈ సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Updated Date - 2022-08-21T16:31:53+05:30 IST