సెప్టెంబర్ 12 నుంచి Chennai ‘ఉమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్’
ABN , First Publish Date - 2022-07-01T16:15:00+05:30 IST
ఈ ఏడాది సెప్టెంబరు 12 నుంచి 18వ తేదీ వరకు నుంగంబాక్కంలోని ఎస్డీఏటీ టెన్నిస్ స్టేడియంలో ఉమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షి్ప
చెన్నై, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది సెప్టెంబరు 12 నుంచి 18వ తేదీ వరకు నుంగంబాక్కంలోని ఎస్డీఏటీ టెన్నిస్ స్టేడియంలో ఉమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ జరుగనుంది. దేశవిదేశాల నుంచి పలువురు టెన్నిస్ క్రీడాకారిణులు తరలిరానున్న ఈ ఛాంపియన్షిప్ కోసం ఏర్పాట్లు చేపట్టినట్లు నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్ర యువజన, క్రీడాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సెల్వి అపూర్వ, స్పోర్ట్స్ డెవల్పమెంట్ అథారిటీ ఆఫ్ తమిళనాడు మెంబర్ సెక్రటరీ డాక్టర్ కేపీ కార్తికేయన్, టీఎన్టీఏ కార్యదర్శి ప్రేమ్కుమార్ కర్రా తదితరులు గురువారం చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రీడాభిమాని అయిన ముఖ్యమంత్రి చొరవతో చెన్నైలో మొట్టమొదటి మహిళా టెన్నిస్ ఛాంపియన్షి్ప జరుగనుందన్నారు. ఇందుకోసం ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ (డబ్లూటీఏ) ఏర్పాట్లు చేస్తోందని, 2008 తరువాత మొదటిసారిగా డబ్ల్యూటీఏ దేశానికి తిరిగి వస్తోందన్నారు.